ఏపీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో గెలిచేందుకు టీడీపీ భారీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. గత ఎన్నికల్లో జగన్పై పోటీ చేసి ఓడిన టీడీపీ నేత బీటెక్ రవి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సొంత కుటుంబంలో ఒకరిని ఇక్కడ పోటీకి పెట్టనున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిస్తే జగన్కు కోలుకోలేని షాక్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.