AP: తాడేపల్లిలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను డీఎస్సీ అభ్యర్థులు బుధవారం కలిశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవినీతిని వారు జగన్కు వివరించారు. టీడీపీ నేతలు స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకున్నారని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని అభ్యర్థులు తెలిపారు. నిజమైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.