AP: రాష్ట్ర ప్రయోజనాల కోసమే మావిగన్ను సూచించామని, దానివల్ల ప్రజలపై రుణభారం పడదని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. మావిగన్ కారిడార్తో రాజధాని తొలిరోజు నుంచే అందుబాటులోకి వస్తుందని, కేవలం రూ.20 వేల కోట్లతో పోర్టు, ఎయిర్పోర్టు, జాతీయ రహదారులతో వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అమరావతిలో కనీస వసతులకే రూ.2 లక్షల కోట్లు అవసరపడతాయని, చంద్రబాబు తన పనులతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని, అందుకే ప్లాన్ బీ కింద మావిగన్ ప్రతిపాదించామని జగన్ అన్నారు.