AP: కృష్ణా జిల్లా పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్, వైసీపీ నేతలపై కేసు నమోదైంది. నిన్న జగన్ పర్యటనలో నిబంధనలు అతిక్రమించారని, విధులకు ఆటంకం కలిగించారంటూ పమిడిముక్కల పోలీసులు కేసు నమోదు చేశారు. గోపువానిపాలెం వద్ద ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించొద్దని పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ను సీఐ చిట్టిబాబు కోరారు. దాంతో అనిల్ కుమార్, వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.