AP: జై భీమ్ భారత్పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్కుమార్పై ఏలూరు, కాళ్ల పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టి, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రసంగించారనే ఫిర్యాదులపై ఈ కేసులు నమోదు చేశారు. గత నెల 28న ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ శంఖారావం బహిరంగ సభలో శ్రవణ్, యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లను వ్యక్తిగతంగా దూషించారు. దీంతో పెద్దాడ వెంకటరమణ, తోట ఫణిబాబు ఫిర్యాదు చేశారు.