AP: బాధితుల గొంతు వినిపించిన మీడియాపై విశాఖ పోలీసులు దాడి చేశారని టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపించారు. "కంచర్లపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో సీఎస్ నేతృత్వంలో కుట్ర జరుగుతోంది. సజ్జల, జగన్ సూచనలతోనే మీడియాపై అక్రమ కేసులు పెట్టారు. మీడియాపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలి." అని ఆయన డిమాండ్ చేశారు.