దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఏపీలో జన గణనపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు ప్రారంభించింది. జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వీరి ఆధ్వర్యంలో జనగణన నిర్వహించనున్నారు. జనగణనలో ఇళ్లు, వ్యవసాయం, సాంప్రదాయ సంస్కృతి, వ్యాపారం, సరఫరా రద్దీ, వృత్తులు వంటి వివరాలను నమోదు చేసుకోనున్నారు.