ఈ నెల 5వ తేదీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉండనుంది. రాష్ట్రంలో నూతనంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. కలెక్టర్ల కాన్ఫరెన్సుకు మంత్రులు హాజరు కానున్నారు. ఈ కాన్ఫరెన్స్ నిర్వహణ ఏర్పాట్లపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సమీక్ష నిర్వహించనున్నారు. శాంతి భద్రతలు, గంజాయి నిర్మూలన, ఇసుక, భూములు, సహజ వనరులపై సమావేశంలో సీఎం ప్రత్యేకంగా సమీక్షించనున్నారు.