ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల పోలింగ్ దగ్గరి నుంచే కూటమి అరాచకాలు మొదలయ్యాయని, సూపర్-6 హామీల పేరుతో ప్రజలను దగా చేశారని వైసీపీ నేత మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా ప్రజలను వంచించడమేనని, ఆయనకు రాజకీయంగా ఇదే చివరి టర్మ్ అని విమర్శించారు. కూటమి పాలనలో అన్ని రంగాల్లో అవినీతి జరిగిందని ఆయన పేర్కొన్నారు.