వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం (మే 31) తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబును చీఫ్ మినిస్టర్ కాదని, చీటింగ్ మినిస్టర్ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హామీలకు ఎగనామం పెట్టి, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. మహానాడును లోగ్రేడ్ నాడుగా అభివర్ణించారు. చంద్రబాబు మహిళలందరికీ, తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడిచారని, టీడీపీకి, వైసీపీకి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు.