AP: మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు సీఎం చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిగా ఆమెను తప్పించారు. మన్యం శ్రీనివాస్ను నియమిస్తూ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకంపై సుగుణమ్మ వర్గం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం తిరుపతి రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.