అమరావతికి చట్టబద్ధత కల్పించే పేరుతో చంద్రబాబు డ్రామా చేశారని, హడావిడిగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. 6గంటల సమావేశంలో జగన్ను తిట్టడానికే సరిపోయిందని, కూటమి నేతలు జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కౌన్సిల్లో చర్చ జరగకుంటే అది తీర్మానం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.