కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ విశాఖలో జరిగిన CII భాగస్వామ్య సదస్సులో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు యావత్ భారత దేశ అభివృద్ధికి స్ఫూర్తిదాయకమని అన్నారు. గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా విశాఖ ఎదుగుతోందని, స్టీల్, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ప్రత్యేకతను చాటుకుంటోందని తెలిపారు. 2047 నాటికి 'స్వర్ణాంధ్ర విజన్'తో ఏపీ సాంకేతికంగా, ఆర్థికంగా బలోపేతం అవుతుందని, అదే సమయంలో భారతదేశం సుసంపన్నమైన దేశంగా అవతరిస్తుందని అన్నారు.