భారత ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ మంగళవారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కుకుని అమ్మవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతికి, టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర అమ్మవారి ప్రసాదాలు అందజేసి, శేష వస్త్రంతో సత్కరించారు.