స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ శనివారం చిత్తూరులో ఇంటింటా చెత్త సేకరణ కోసం త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాలు వస్తాయని తెలిపారు. ఆయన చిత్తూరు నగరపాలక అధికారులతో సమావేశమై, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఒప్పంద ప్రక్రియ పూర్తయిందని, ఇంటింటా చెత్త సేకరణ, బయో మైనింగ్ వంటి అంశాలపై కమిషనర్ నరసింహ ప్రసాద్ తో చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.