కుప్పం పరిధిలోని చెక్కనాథం పంచాయతీ పరిసరాల్లో గురువారం తెల్లవారుజామున రైతుల బోరు బావుల వద్ద ఉన్న కరెంట్ కేబుళ్లను దొంగలు అపహరించినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో తరచుగా ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాధితులు తెలిపారు. అధికారులు స్పందించి దొంగలను పట్టుకోవాలని రైతులు కోరుతున్నారు.