శుక్రవారం శాంతిపురం మండలంలోని శివపురం గ్రామంలో నారా భువనేశ్వరి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ముఖ్యంగా, వితంతువులకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూడాలని స్థానిక నాయకులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టిటిడి బోర్డు సభ్యుడు శాంతారాం కూడా పాల్గొన్నారు.