గురువారం నాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు తిమ్మరాజుపల్లి టీవీ చిత్ర యూనిట్ ను అభినందించారు. కుప్పం నియోజక వర్గం, శాంతిపురం మండలం, తిమ్మరాజుపల్లెకు చెందిన మునిరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించడంతో, చిత్ర యూనిట్ సభ్యులు ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఇలాంటి మంచి చిత్రాలు మరెన్నో తీయాలని సినిమా బృందానికి సూచించారు.