రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ పిలుపు మేరకు కుప్పంలో రెండు రోజుల హైబ్రిడ్ మహానాడు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని ఎమ్మెల్సీ శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో 20 వేల మందితో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ విజయం కోసం కృషి చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.