చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఎంపీటీసీ ఉపఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి గీత నామినేషన్ వేయకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు డీసీసీ అధ్యక్షుడు భాస్కర్పై దాడి చేసారు. ఆయన కారు అద్దాలు కూడా పగలగొట్టారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.