కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం సమీపంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం సమయంలో, రైతు అశోక్ తన పాడి ఆవును చెట్టు కింద కట్టేయగా, ఆ చెట్టు సమీపంలో పిడుగు పడింది. దీంతో రూ. 85 వేలు విలువైన ఆవు మృతి చెందిందని బాధితుడు శనివారం తెలియజేశాడు.