నగరి నియోజకవర్గం, విజయపురం మండలంలోని జగన్నాధపురం, నిండ్ర మండలం ఆగరం పేట గ్రామాలలో మాజీ మంత్రి ఆర్కే రోజా మంగళవారం పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా, నాయకులు ఆయా మండలాలలోని రాజకీయ పరిస్థితులను రోజాకు వివరించారు. అనంతరం రోజా మాట్లాడుతూ, మండలాలలో పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.