నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజా తన భర్త సెల్వమణితో కలిసి దుబాయ్ వెళ్లారు. అక్కడ 'పాంథర్ క్లబ్' గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్తో కలిసి సందడి చేశారు. ఆయనతో కాసేపు మాట్లాడిన ఈ వీడియోను రోజా బుధవారం విడుదల చేశారు. ఈ సంఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.