హైబ్రిడ్ మహానాడు అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి రోజా విమర్శించారు. స్టేజీలపై రికార్డింగ్ డాన్సులు పెట్టి ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేశారని, టీడీపీ నేతల భాష అసహ్యంగా ఉందని ఆమె అన్నారు. సభల్లో జగన్ నామస్మరణే చేశారని, చంద్రబాబు నాయుడు మోసాలతోనే సీఎం అయ్యారని ఆరోపించారు. తన చెల్లికి జగన్ ఇచ్చిన ఆస్తి దేశంలో ఎవరూ ఇవ్వలేదని, హెరిటేజ్ ఆస్తుల్లో చంద్రబాబు తల్లి, చెల్లికి ఎంత వాటా ఇచ్చారని టీడీపీ నేతలను ప్రశ్నించారు.