విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ పాఠశాలలో గురువారం మెగా పేరెంట్స్-టీచర్స్ సమావేశం నిర్వహించారు. తల్లిదండ్రులు పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మడ అధికారి రాజేంద్ర అన్నారు. ఆటల పోటీల్లో విజేతలకు ఎమ్మెవో హరిప్రసాద్ వర్మ బహుమతులు అందించారు. గ్రామ సర్పంచ్, హెచ్ఎమ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.