పలమనేరు నియోజకవర్గం, రాయలపేటలో బుధవారం గంగ జాతరను భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నడివీధి గంగమ్మకు పుష్పాలు, ఆభరణాలతో ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లు వంటి అన్ని ఏర్పాట్లను ముందస్తుగా చేశారు. మహిళలు గంగమ్మకు బోనాలు, చీర సారెలను సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు.