పలమనేరు నియోజకవర్గం, వీకోటలోని పలు గ్రామాలలో బుధవారం పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అభిమానులు పూల వర్షం కురిపించారు. రెండు కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను త్వరితగతిన కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు.