పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంట ఊరు దగ్గర వైయస్సార్ నగర్ లో కొలువైన కనుమ గంగమ్మ జాతరకు రావాలని ఆలయ చైర్మన్ డాక్టర్ మురుగన్, స్థానిక ప్రజలు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి మర్యాద తాంబూలం తో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో జరగనున్న ఉత్సవాల కార్యక్రమాలను వివరించారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.