ఆదివారం రాత్రి పలమనేరు పట్టణంలో వాసవి దేవి జయంతి సందర్భంగా అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించారు. అనంతరం పుష్ప పల్లకిలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వగా, భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.