పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, బొమ్మాయిపల్లిలో వెలసిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో బుధవారం 43వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో గణపతిపూజ, రక్షాబంధనం, స్వామి వారికి అభిషేకాలు, పూజలు జరిగాయి. అనంతరం వేద పండితుల వేద మంత్రాల నడుమ మంగళ హారతులు ఇచ్చి, స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు.