పూతలపట్టు: ప్రజల అవగాహన కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు

గ్రామాలు, పట్టణాల్లో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. పూతలపట్టు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో బుధవారం సీఐ గోపీ ఆధ్వర్యంలో 'మీకు తెలుసా' పేరుతో ప్రత్యేక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో సైబర్ నేరాలు జరిగే తీరు, వాటి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన మార్గాలపై కీలక సమాచారం పొందుపరిచారు. అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్