చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, దేవస్థానం ఈ. వో పెంచల కిషోర్ అందజేశారు.