మంగళవారం యాదమరి మండలంలో పర్యటించిన కలెక్టర్ సుమిత్ కుమార్ ను పూతలపట్టు నియోజకవర్గ విలేకరులు కలిసి వీకోట హత్య కేసు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వినతి పత్రం అందించారు. స్థానిక జర్నలిస్టులు మాట్లాడుతూ, వీ కోటకు చెందిన విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్య తమను కలచివేసిందని తెలిపారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.