పుంగనూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గురువారం సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఎంపీడీవో లీలా మాధవి ఈ సమావేశాన్ని నిర్వహించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు సమాచారం అందించడంలో పారదర్శకత, సమయపాలన అవసరమని ఆమె తెలిపారు. మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.