పుంగనూరు: గాయాల పాలైన జింకను కాపాడిన రైతు

గాయాల పాలైన జింకను రైతు కాపాడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, ఇరికిపెంట పంచాయతీ మేటిమంద వద్దకు గాయాలపాలైన ఒక జింక వచ్చింది. గాయంతో వచ్చిన జింకను చూసిన గ్రామవాసి చంద్ర జింకకు ప్రథమ చికిత్స చేసి అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఘటన స్థలానికి సోమల బీట్ ఆఫీసర్ ప్రభాకర్ చేరుకొని జింకను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్