రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎటువంటి కేసులు లేకుండా జైలు నుంచి విడుదల కావాలని శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం పులిచెర్లలోని ఎల్లమ్మ ఆలయంలో వైసీపీ నాయకుడు మురళి రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు అమ్మవారికి పెద్ద సంఖ్యలో టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. కోర్టు తీర్పుతో కడిగిన ముత్యంలా ఎంపీ బయటికి వస్తారని వైసీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.