వరదయ్య పాలెంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ ముగాల వెంకయ్య ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. గతంలో 2024లో సీఎం ప్రజాదర్బార్లో ఈ అంశంపై వినతి అందగా, అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి నివేదిక సమర్పించారు. తాజాగా మరోసారి ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.