ఆదివారం శ్రీకాళహస్తిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని అగ్రహారానికి చెందిన గంగాధర్ అనే మేస్త్రీ భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మృతిచెందాడు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో అతని భార్య, ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. తోటి కార్మికులతో గంగాధర్ తనను తాను 'గంగమ్మ వరప్రసాదంగా పుట్టానని, తనకు ఏమీ కాదని' చెప్పేవాడని తెలిసింది.