శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 4న, AP నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విక్రమ్ డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ మేళా జరగనుంది. ఈ కార్యక్రమంలో 12 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొని, 700కు పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. పీజీ, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 3లోపు https://naipunyam.ap.gov.in/ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.