శ్రీకాళహస్తి పట్టణంలోని పద్మశాలిపేటలో బుధవారం ఉదయం చోరీ సంఘటన వెలుగుచూసింది. తాళం వేసిన విజయలక్ష్మి, మునిరాజాల ఇళ్లలోకి దుండగులు చొరబడి మొత్తం 9.8 తులాల బంగారం, 18 తులాల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసినట్లు సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు.