శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్లో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్లోని 24 గదులకు గత నాలుగు రోజులుగా మున్సిపల్ సిబ్బంది అర్ధాంతరంగా తాళాలు వేయడాన్ని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. ఈ విషయమై ఆయన సూచనల మేరకు, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు నేతృత్వంలో మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.