తడ(M) భీములవారిపాలెం చెక్పోస్ట్ వద్ద వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై నలుగురు పోలీసులపై ఎస్పీ సుబ్బరాయుడు సస్పెన్షన్ వేటు వేశారు. హెడ్ కానిస్టేబుల్ రాధాకృష్ణతో పాటు ఏఆర్ కానిస్టేబుళ్లు రవి, సురేశ్, రాజులను లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరిపి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.