తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాయుడుపేట అర్బన్ పోలీసులు ఇంటి దొంగతనాల కేసును ఛేదించి, పార్వతీపురం జిల్లా గారుగుపల్లి గ్రామానికి చెందిన చందక మణికంఠను సోమవారం అరెస్ట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గుర్తించి, వారం రోజుల్లో అతన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 52 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చేసిన సేవను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.