ప్రముఖ సినీ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నుంచి కాలినడకన బయల్దేరిన ఆమె, పాదాల మండపం వద్ద స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి ప్రార్థనలు చేసి నడక ప్రారంభించారు. గురువారం రాత్రి తిరుమలలో బస చేయనున్న ఆమె, శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.