తిరుమలలో గురువారం మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. నిన్న76,501 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.4.39 కోట్ల ఆదాయం సమకూరిందని టీటీడీ అధికారులు తెలిపారు.