శనివారం ఉదయం తొట్టంబేడు మండలం పొయ్య గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి అరక్కోణం వైపు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడటంతో డ్రైవర్కు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి డ్రైవర్ను బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.