కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం విఐపీ విరామం సమయంలో ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకులు మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి మంత్రిని పట్టువస్త్రాలుతో సత్కరించారు.