తిరుపతి: టీటీడీ నిధుల మంజూరుపై కాంగ్రెస్ నేత ఆగ్రహం

కాణిపాకంలో వసతి సముదాయం, కళ్యాణ మండపం నిర్మాణానికి టీటీడీ రూ. 25 కోట్లు మంజూరు చేయడంపై కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ, కాణిపాకంలో ఇప్పటికే అనేక వసతి సముదాయాలు ఉన్నాయని, రద్దీ కూడా అంతగా ఉండదని అన్నారు. అలాంటి చోట నిర్మాణాలకు టీటీడీ భారీ నిధులు కేటాయించడం భక్తుల నిధులను వృథా చేయడమేనని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్