గీతా జయంతి సందర్భంగా తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజనం వేదికపై ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో 50 మంది వేద పండితులు భగవద్గీతలోని 18 అధ్యాయాలలోని 700 శ్లోకాలను పారాయణం చేశారు. ఈ కార్యక్రమం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శివ సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో జరిగింది.