ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్ మొహమ్మద్ ముజామిల్ను అరెస్ట్ చేసినట్లు SP సుబ్బారాయుడు తెలిపారు. ‘నిందితుడికి ఉన్న పరిచయాలతో అతను చైనా వంటి దేశాలకు ఎర్రచందనం రవాణా చేశాడు. ఇతనికి సహకరిస్తున్న జోజో, మైఖేల్ను గుర్తించాం. మరికొందరిని ఇటీవల అరెస్ట్ చేశాం. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం. ఇందుకు అటవీ సిబ్బంది కృషి చేస్తున్నారు’ అని SP పేర్కొన్నారు.